Tuni Girl Gnaneswari Missing Case Update: తుని చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు.. పోలీసులు ఆమె కోసం గాలింపును కొనసాగిస్తున్నారు. తాజాగా పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాప ఆచూకీ చెబితే రూ.లక్ష పారితోషకం ఇస్తామని ప్రకటించారు. పాప వివరాలతో వాల్పోస్టర్లు, కరపత్రాలు ప్రింట్ చేశారు. పాప గురించి సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పాపం సమాచారం తెలిసినవారు ఫోన్ చేయాలని.. నంబర్లను విడుదల చేశారు.