Tirumala 25 Lakhs Devotees Darshan In May Month 2026: తిరుమలలో మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు అయ్యాయి. టీటీడీ చర్యలతో మే నెలలో రికార్డుస్థాయిలో 25.46 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత నెల 24వ తేదీన అత్యధికంగా 98,058 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గత నెలలో 12.19 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.120.28 కోట్లు లభించింది.