Tirumala Srivari Laddu Sales All Time High In May 2026: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు సరికొత్త రికార్డ్ సృష్టించాయి. మే నెలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం మొత్తం 1.21 కోట్లు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. 2024 మే నెలలో 1.01 కోట్లు, 2025 మే నెలలో 1.10 కోట్ల లడ్డూలు విక్రయించారు. ఈసారి లడ్డూ ప్రసాదాల విక్రయాల సంఖ్య పెరిగింది. టీటీడీ రోజుకు సగటున 4.08 లక్షల లడ్డూలు తయారు చేస్తోంది.