Jyestabhishekam From June 26 To 28 In Tirumala Temple: తిరుమల శ్రీవారి జ్యేష్టాభిషేకం జూన్ నెలలో నిర్వహించనున్నారు. వచ్చే నెల 26 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ముందుగా ఆలయంలో మొదటిరోజు మలయప్పస్వామికి ఉండే బంగారు కవచాన్ని తొలగించి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరు మంజనం నిర్వహిస్తారు. సాయంత్రం స్వామివారికి వజ్రకవచాన్ని అలంకరించి ఊరేగిస్తారు. రెండోరోజు ముత్యాల కవచం.. మూడో రోజు తిరుమంజనాదులు నిర్వహించి తిరిగి బంగారు కవచాన్ని సమర్పిస్తారు.