TTD Plans Multi Level Parking In Tirumala: ఇటీవలి కాలంలో తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంది. భక్తుల రద్దీ పెరిగిన సమయంలో అలిపిరి చెక్పోస్ట్ దగ్గర ట్రాఫిక్ కనిపిస్తోంది. ఈ వాహనాలన్నీ కొండపైకి వెళ్లిన తర్వాత అక్కడ పార్కింగ్ సమస్యలు ఎదురవుతున్నాయి. వాహనాలు నిలిపేందుకు సరైన పార్కింగ్ లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.