Tirumala Training For Fast Food Vendors By TTD: టీటీడీ భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల ఆహార భద్రత, పరిశుభ్రతపై ఫోకస్ పెట్టింది. దీని కోసం ఆహార భద్రత, పరిశుభ్రతలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. భక్తులకు మంచి ఆహారాన్ని అందించేందుకు కొన్ని ప్రమాణాలను పాటించాల్సిందేనని టీటీడీ చెబుతోంది. అందుకే 325 షాపుల్లో పనిచేసే 1,300 మంది సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తున్నారు.