TTD Handed Over Rs 4 Lakhs Gold To Hyderabad Devotees: తిరుమలలో హైదరాబాద్కు చెందిన శ్రీవారి భక్తులు మర్చిపోయిన రూ.4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను టీటీడీ అధికారులు అప్పగించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు అన్నమయ్య భవన్లో గదిని తీసుకున్నారు. దర్శనం అనంతరం గది ఖాళీ చేసి వెళ్లారు. అయితే గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బందికి బంగారం దొరికింది. వెంటనే భక్తుల్ని పిలిపి తిరిగి అప్పగించారు.