తిరుమలకు వెళ్తున్నారా.. ఆ రోజున మెట్లమార్గాలు 24 గంటలూ ఓపెన్.. టీటీడీ కీలక నిర్ణయం..

8 months ago 20
TTD Trust Board Decisions: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి సమావేశమై బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. క్రౌడ్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ కోసం తొలిసారిగా ఇస్రో సేవలు ఉపయోగించాలని టీటీడీ పాలకమండలి భేటీలో నిర్ణయించారు. అలాగే గరుడసేవ రోజున ఘాట్ రోడ్లు, మెట్ల మార్గాలు 24 గంటలూ తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article