తిరుమల శ్రీవారికి విశాఖ భక్తుడి భారీ విరాళం.. కళ్లుచెదిరే మొత్తం.. ఎంతంటే?

1 year ago 25
Visakha Devotee 10 lakhs Donation To TTD: తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం అందింది. విశాఖపట్నానికి చెందిన దంపతులు టీటీడీకి భారీ విరాళం అందించారు. టీటీడీ ఆధ్వర్యంలోని సర్వశ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు రవికుమార్ దంపతులు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి టీటీడీ ఏఈవోను కలిశారు. ఈ సందర్భంగా విరాళం అందించిన భక్తులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అభినందించారు.
Read Entire Article