తిరుమల శ్రీవారికి పవన్ కళ్యాణ్, సతీమణి లెజినోవా భారీ విరాళం.. ఎంత ఇచ్చారంటే!

1 year ago 23
Tirumala Pawan Kalyan Wife Anna Lezhneva Rs 17 Lakhs Donation: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కుమారుడు మార్క్ శంకర్ పేరుతో అన్నదాన ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం అందజేశారు. గతంలో మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడటంతో లెజినోవా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం ఆమె తిరుమలకు చేరుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకున్నారు.
Read Entire Article