Tirumala Devotee Niira Radia Donated Electric Bus To TTD: టీటీడీకి మరో భారీ విరాళం అందింది. నీరా రాడియా అనే భక్తురాలు ఒక విద్యుత్ బస్సుతో పాటుగా 15 యాపిల్ ట్యాబ్లను అందజేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో బస్సుకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత బస్సు తాళం, ట్యాబ్లను టీటీడీకి అందజేశారు. ఈ బస్సు విలువ రూ.1.13 కోట్లు ఉంటుందని దాత చెబుతున్నారు. ట్యాబ్ల విలువ రూ.20 లక్షలు ఉంటుంది.