Kolkata Devotee Rs 1 Crore Donation To TTD Tirumala: తిరుమల శ్రీవారికి భక్తులు భారీ విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు విరాళాలు పెరిగాయి. తాజాగా కోల్కతాకు చెందిన భక్తుడు ప్రదమ్ కుమార్ కుటుంబం ఫ్యామిలీ ట్రస్ట్ భారీ విరాళం అందజేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.కోటి విరాళం అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దాత ఈ డీడీని అందజేశారు.