Tirumala Abhishekam Darshan For Common Devotees: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. టీటీడీ పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులకు వేగంగా దర్శనం పూర్తయ్యేలా చూస్తోంది. తిరుమలలో రద్దీ కారణంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తోంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. రోజుకు అదనంగా మరో 15వేల మందికి దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.