తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. రేపే ఆ కోటా టికెట్లు విడుదల.. త్వరపడండి

1 year ago 41
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. టీటీడీ ట్రస్టులకు విరాళాలు ఆందించే దాతలకు కేటాయించే టికెట్ల కోటా రేపు విడుదల కానుంది. టీటీడీ ట్రస్టు దాతల దర్శనం, వసతి గదులకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని కోరింది. మరోవైపు తిరుమల శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా బుధవారమే విడుదలైంది. జనవరి నెల కోటాను బుధవారం విడుదల చేశారు.
Read Entire Article