తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం.. ప్రత్యేకతలివే

1 year ago 34
Tirumala Temple Deepavali Asthanam: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుక జరిగింది. ఇవాళ సాయంత్రం మలయప్పస్వామి తిరుమాఢవీధుల్లో ఊరేగుతూ దర్శనమివ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా టీటీడీ ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. తిరుమలలో (భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేకుండా క్యూలైన్లలో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు 12 గంటల సమయం పడుతోంది.
Read Entire Article