TTD Respond On Devotee Entered With Mobile In Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మొబైల్ కలకలం రేపింది. ఓ భక్తుడు కంపార్ట్మెంట్లోకి మొబైల్ తీసుకెళ్లి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన టీటీడీ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఆలయంలో మూడంచెల పటిష్టమైన భద్రత ఉంటుందని తెలిపింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని తెలిపారు.