తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జులై నుంచి సెప్టెంబర్ నెల వరకూ వివిధ కారణాలతో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. పర్వదినాలు, ఉత్సవాల నేపథ్యంలో పలు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను ప్రకటన ద్వారా వెల్లడించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ నెలలో చాలా రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేక్ పడనుంది.