వికారాబాద్ జిల్లా కొడంగల్లో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మహాలక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.110 కోట్లు మంజూరు చేశారు. తిరుమల తరహాలో కృష్ణశిలలతో, రాజగోపురాలతో 5.63 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. పుష్కరిణి, కళ్యాణకట్ట, అన్నదాన సత్రం వంటి అత్యాధునిక సదుపాయాలతో 18 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం భక్తుల దర్శనం కోసం బాలాలయం అందుబాటులో ఉంచారు.