తిరుమల తరహాలో ఇకపై అక్కడ కూడా నిత్యాన్నదానం.. భక్తులకు ఏపీ సర్కారు తీపికబురు

1 year ago 32
AP Nitya Annadanam scheme in 16 temples: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 23 ప్రధాన దేవాలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఏడు దేవాలయాల్లో నిత్యాన్నదానం అమల్లో ఉంది. మిగతా 16 ఆలయాల్లోనూ అన్నదానం అమలు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. భక్తులకు పవిత్రమైన భావన కలిగించేలా అన్నదాన పథకం అమలు చేయాలని సూచించారు.
Read Entire Article