Tirupati JSS Mahavidyapeetha Off Campus Mou With AP Govt: తిరుపతిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఆఫ్ క్యాంపస్ను ఏర్పాటు చేయబోతోంది. మైసూరుకు చెందిన జేఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే క్యాంపస్కు సంబంధించి మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ ఎంవోయూపై ఏపీ ఉన్నత విద్యామండలి అధికారి, జేఎస్ఎస్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ జేఎస్ఎస్ క్యాంపస్లో మొత్తం 74 కోర్సులు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.