తల్లికి వందనం పథకాన్ని అవకాశంగా మలుచుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ పథకం పేరుతో సోషల్ మీడియాలో వచ్చే లింకులను నమ్మి క్లిక్ చేయవద్దని సూచించారు. ఏవైనా సందేహాలు, సమాచారం కావాలంటే సమీపంలోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. మరోవైపు జూలై 22వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులను విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనుంది.