తమ్ముడికి చంద్రబాబు నివాళి.. కంటతడి పెట్టుకున్న ఏపీ సీఎం

1 year ago 21
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చివరి శ్వాస విడిచారు. రామ్మూర్తి పార్థివ దేహాన్ని ఇవాళ ఉదయం స్వగ్రామం ఏపీలోని చిత్తూరు జిల్లా నారావారి పల్లెకు తీసుకువచ్చారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి లోకేశ్, నారా బ్రహ్మిణి, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, సినీ నటుడు మోహన్ బాబు తదితరులు ఆయనకు నివాళి అర్పించారు.
Read Entire Article