తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అధికారానికి సిద్ధమవ్వడంపై లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్టాలిన్ మంచి పాలన అందించినప్పటికీ.. ఓటర్లు మార్పు కోరుకున్నారని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా ప్రస్తుత 'జన్జీ' యువత రాజకీయాల్లో 'ఒకే ఒక్కడు' సినిమా తరహాలో తక్షణ అద్భుతాలను ఆశిస్తున్నారని సిద్ధాంత ప్రాతిపదిక లేని ఇలాంటి గెలుపులు ప్రజాస్వామ్యానికి కొంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.