తమిళనాడు రాజకీయ పరిణామాలపై రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇవ్వని నేపథ్యంలో.. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు, రాజ్యాంగానికి విరుద్ధమని ఏబీవీ అభిప్రాయపడ్డారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మరోవైపు అరవ రాజకీయాలలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ నుంచి క్లియరెన్స్ రాలేదు.