AP Health Department Officials Team Visits Tamil Nadu Hospitals: ఏపీ నుంచి అధికారుల టీమ్ తమిళనాడు వెళ్లింది. అక్కడ ప్రభుత్య ఆసుపత్రులకు జరుగుతున్న మందుల సరఫరా వ్యవస్థపై అధ్యయనం కోసం వెళ్లింది. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో టీమ్ పర్యటిస్తోంది. ఏపీ ఆరోగ్యశాఖ బృందం మంగళవారం చెన్నైలో పర్యటించింది. ఈ టీమ్ అక్కడి ఆస్పత్రులను పరిశీలించి మందుల సరఫరా గురించి వివరాలు సేకరిస్తున్నారు.