తండ్రి, పెద్ద కూతురు మృతి.. మూడ్రోజులుగా మృతదేహాల మధ్యే తల్లి, చిన్న కూతురు, ఏం జరిగింది..?

1 month ago 11
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుర్హాన్‌పురంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. స్థానిక జర్నలిస్టు కొణతల రాము, అతని ఐదేళ్ల కుమార్తె దివ్య నైనీలు అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. రాము భార్య రమ్య, వీరిద్దరినీ హతమార్చి మూడు రోజుల పాటు మృతదేహాలతోనే ఇంట్లో గడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుండి దుర్వాసన రావడంతో పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. మృతదేహాల పక్కనే రమ్య, ఆమె చిన్న కూతురు దీక్ష అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Entire Article