డ్వాక్రా గ్రూపు సభ్యులకు శుభవార్త.. ఆ పథకం 2029 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..

1 year ago 19
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు సభ్యులు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 10 లక్షల బీమా పరిహారం అందుతుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 409 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ వెసులుబాటుతో 1.67 లక్షల మంది కొత్త సభ్యులు బృందాల్లో చేరారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ఈ నిర్ణయం ద్వారా తెలుస్తోంది.
Read Entire Article