డీసీఎం.. ఇప్పుడెందుకు మాట్లాడరు..? పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఫైర్

1 year ago 30
ఏపీలో టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ మరోసారి విమర్శలు చేసింది. కూటమి పాలనలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగాయని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆరోపించారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపైనా విమర్శలు చేశారు. వారి నియోజకవర్గాలలో అత్యాచారాలు జరిగితే కనీసం పరామర్శించాల్సిన బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అమ్మాయిలు మాయమయ్యారన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడెందుకు మాట్లడటం లేదని మండిపడ్డారు.
Read Entire Article