నియోజకవర్గాల పునర్విభజనపై చిదంబరం చేసిన ట్వీట్పై స్పందించిన ఏపీ మంత్రి నారా లోకేష్కు.. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగ సంబంధిత ఆందోళనలకు రాజకీయ నాటకాలతో కాదు, రాజ్యాంగబద్ధమైన సమాధానాలతోనే స్పందించాలని చురకలు అంటించారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా రాజ్యాంగబద్ధమైన హామీ ఉండాలని గతంలో చంద్రబాబు చెప్పిన రక్షణ ఎక్కడ అంటూ లోక్ష్ను పొంగులేటి ప్రశ్నించారు.