తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల (SHGs) బలోపేతానికి సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు సెర్ప్ భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. తొలి విడతగా 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో డీమార్ట్ తరహా మహిళా శక్తి సూపర్ బజార్లను, అలాగే ఖమ్మంలో లాజిస్టిక్స్ హబ్, రైస్మిల్లును ఏర్పాటు చేయనున్నారు. సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. అందుకు అవసరమైన భూసేకరణ కోసం జిల్లాల కలెక్టర్లకు లేఖలు రాయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను స్థానిక మహిళా సమాఖ్యలకే అప్పగించనున్నారు.