డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. దాని కోసమేనా..?

7 months ago 15
AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణ హైడ్రా కమిషనర్‌ ఎ.వి. రంగనాథ్‌ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుమారు రెండు గంటల పాటు సాగిందని సమాచారం. ఈ సందర్భంగా ఇద్దరూ వివిధ పరిపాలనా, సామాజిక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా మర్యాద పూర్వక సమావేశమని.. అధికారిక అంశాలపై చర్చ జరగలేదని పవన్‌ కల్యాణ్‌ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే ఏపీలో కూడా హైడ్రా వ్యవస్థ ఏర్పాటుపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Read Entire Article