టైర్ పేలడంతో.. తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

7 months ago 15
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కలగాసుపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సులు మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ ముందే అప్రమత్తం అవ్వడంతో.. పెను ప్రమాదం తప్పింది. టైరు పేలి ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనేఅప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రావెట్ బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బెంగళూరు నుంచి రాయచూర్‌ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలడంతో..గార్లదిన్నె మండలం తలగాసిపల్లి క్రాస్‌ సమీపంలో ప్రమాదం వెలుగు చూసింది.
Read Entire Article