పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే పార్టీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. టీవీకే కూటమి మూడు స్థానాల్లో విజయం కూడా సాధించింది. అయితే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే యానాం నియోజకవర్గంలో మాత్రం విజయ్ టీవీకేకు తెలుగు ప్రజలు ఓటమి రుచి చూపించారు. యానాం నియోజకవర్గంలో టీవీకే తరుఫున పోటీ చేసిన తోట రాజుకు డిపాజిట్ కూడా దక్కలేదు. తోట రాజుకు కేవలం 167 ఓట్లు పోలయ్యాయి. నోటా కంటే తక్కువ ఓట్లు రావటం గమనార్హం.