టాయిలెట్ వాటర్‌తో కరెంట్ ఉత్పత్తి.. అబ్బురపరిచిన ఆవిష్కరణలు..

4 months ago 19
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరుగుతున్న దక్షిణ భారత సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థుల వినూత్న ఆవిష్కరణలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తమిళనాడు విద్యార్థిని ధానుశ్రీ ప్రదర్శించిన ‘యూరిన్ పవర్ జనరేషన్’ ప్రాజెక్టు ప్రత్యేకంగా నిలిచింది. టాయిలెట్ వాటర్ నుండి ఎలక్ట్రోడ్ల సహాయంతో కరెంట్ ఉత్పత్తి చేసే విధానాన్ని ఆమె వివరించింది. ఈ ప్రక్రియ తర్వాత మిగిలిన నీటిని శుద్ధి చేసి వ్యవసాయానికి వాడుకోవచ్చని తెలిపింది. మరోవైపు.. పాండిచ్చేరి టీచర్ వీరమణి ఖండన్ కేవలం రూ. 2 వేల లోపు ఖర్చుతో స్మార్ట్ ఫోన్ ద్వారా నడిచే అగ్రికల్చర్ డ్రోన్‌ను తయారు చేశారు.
Read Entire Article