Polavaram Janasena Party Group War: పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. మొన్నటి వరకు ఆరోపణలకు పరిమితమైన వర్గపోరు.. ఇప్పుడు దాడుల వరకు వెళ్లాయి. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు భార్య జ్యోతి తనపై దాడి చేయించిందని జనసేన పార్టీ కొయ్యలగూడెం మండలానికి చెందిన నేత సతీష్ ఆరోపించారు. ఇటు ఎమ్మెల్యే భార్య జ్యోతి తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొయ్యలగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.