జనవరి 2న ఏపీ కేబినెట్ భేటీ.. నూతన సంవత్సరం కానుక ఉంటుందా..!?

1 year ago 34
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం జనవరి రెండో తేదీ భేటీ కానుంది. జనవరి 2న సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో పలు విషయాలపై చర్చించే అవకాశం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పోలవరం, అమరావతి నిర్మాణంపై చర్చించనున్నట్లు సమాచారం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కోసం ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయనుంది.
Read Entire Article