జగన్ మందలించాల్సిందిపోయి ఇలా చేస్తే ఎలా.. చంద్రబాబు

10 months ago 15
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సౌమ్యురాలు.. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన వారిని జగన్ మందలించాల్సింది పోయి.. ఇంకా నోటికొచ్చినట్లు మాట్లాడేలా ప్రోత్సహించడాన్ని ఏమనాలి? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేతగా ఉన్న వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను క్రమశిక్షణలో ఉంచాలన్నారు. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం ఉంటే, అక్కడి పర్యటన దృశ్యాలను.. ఆ దుర్మార్గుడి నెల్లూరు పర్యటనతో జత కలిపి భారీగా జనం వచ్చినట్లు చూపించారు. ఇలాంటి జిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. పర్యటనలతో అసౌకర్యం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోము అన్నారు సీఎం చంద్రబాబు.
Read Entire Article