జగన్ డైలాగ్‌ను ఆయన మీదకే వదిలిన షర్మిల.. వైఎస్ఆర్ కొడుకై ఉండి ఇలానా..!

1 year ago 35
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల టీడీపీ, వైసీపీలపై మరోసారి ఫైరయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అంశం గురించి ప్రస్తుత, గత పాలకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వైఎస్ఆర్ మానస పుత్రికగా పేర్కొన్న వైఎస్ షర్మిల.. ఆ పథకాన్ని గత వైసీపీ పాలకులు నిర్వీర్యం చేశారన్నారు. వైఎస్ఆర్ కొడుకై ఉండి వైఎస్ జగన్ ఆయన ఆశయాలను కొనసాగించలేకపోయారని.. పైపెచ్చు వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా మారారంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ పథకానికి నిధులు విడుదల చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.
Read Entire Article