2017లో కర్నూలు శివార్లలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ గదిలో పదో తరగతి విద్యార్థిని ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. బాలిక ఆత్మహత్య చేసుకుందని పాఠశాల యాజమాన్యం సమాచారం ఇవ్వగా.. మృతదేహంపై గాయాలు ఉండటం, పరిస్థితులు అనుమానాస్పదంగా ఉండటంతో.. తమ కూతురిది ఆత్మహత్య కాాదు హత్య అని తల్లిదండ్రులు ఆరోపించారు. అప్పటి నుంచి ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. సుగాలి ప్రీతి హత్య కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గతంలో డిమాండ్ చేశారు.