తెలంగాణ ప్రభుత్వం చేయూత పెన్షన్ల పంపిణీ విధానంలో కీలక సంస్కరణలు చేపట్టింది. ఇకపై లబ్ధిదారులకు నగదు రూపంలో కాకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛను సొమ్మును జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనివల్ల వృద్ధులు, దివ్యాంగులు పోస్టాఫీసుల వద్ద క్యూ కట్టే శ్రమ తప్పుతుంది. ప్రస్తుతం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ జరుగుతుండగా.. జూన్ చివరి నాటికి దీన్ని పూర్తి చేసి ఆగస్టు నెల నుంచి పెన్షన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయనున్నారు.