మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న ఆయన, గుండెలో నొప్పిగా ఉందని తెలపడంతో ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు పంపనున్నారు. ఇదిలా ఉండగా, చెవిరెడ్డిని కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుఫు న్యాయవాదులు కూడా పిటిషన్ వేశారు. వైసీపీ శ్రేణులు ఆయన అరెస్ట్ను నిరసిస్తూ అలిపిరిలో మొక్కులు చెల్లించుకున్నారు.