చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్

1 year ago 35
Telangana Group 1 Exam: తెలంగాణ గ్రూప్ 1 పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డారు ఓ మహిళా అభ్యర్థి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లిలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాల గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్లావత్ లక్ష్మి అనే అభ్యర్థి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. చీర కొంగులో చిట్టీలు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. అభ్యర్థి లక్ష్మి మహబూబ్ నగర్‌లో ఎస్జీటీ టీచర్‌గా పనిచేస్తున్నారు. టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
Read Entire Article