చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్న మహిళ సరదా.. అసలేం జరిగిందంటే

1 year ago 44
సంగారెడ్డి జిల్లాలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న మహిళ చేసిన ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. అమీన్‌పూర్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మహేశ్వరి అనే మహిళ కారు నడుపుతుండగా.. అది అదుపు తప్పి.. పక్కనే ఆడుకుంటున్న పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో మణిధర్ వర్మ అనే పదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా, అతని సోదరి ఏకవాణి తీవ్రంగా గాయపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ సరదాగా చేసిన పని ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article