చలాన్ పడగానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేయండి.. సీఎం రేవంత్ రెడ్డి..

4 months ago 16
దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు పెరిగిపోతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని నివారించేందుకు కఠిన చట్టాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇకపై ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి రాయితీలు ఉండవని.. నిబంధనలు ఉల్లంఘిస్తే యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా జరిమానా కట్ అయ్యేలా టెక్నాలజీ తీసుకురావాలని ఆదేశించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Read Entire Article