కొరియర్ సంస్థలో పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి కొత్త తరహా మోసాలకు పాల్పడాలని ఆ యువకుడు అనుకున్నాడు. చదివింది తొమ్మిదో తరగతే అయినప్పటికీ లోక జ్ఞానం తెలియడం, పైగా కొరియర్ కంపెనీకి సంబంధించిన కొన్ని టెక్నికల్ పదాలు తెలుసుకుని ఒక ప్రొఫెషనల్గా మారిపోయాడు. విజయవాడ సింగ్నగర్కు చెందిన ఓ యువతికి ఫోన్ చేసి తాను బ్లూ డార్ట్ కొరియర్ అధికార ప్రతినిధి అని పరిచయం చేసుకుని ఆమెను మోసం చేసి రూ. 40 వేలు తీసుకున్నాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు ఐదు గంటల్లోనే అరెస్టు చేశారు.