గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం... అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన

1 year ago 31
ఏపీలో సొంతిల్లు లేనివారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఏపీలోని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇల్లు కట్టిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ క్రమంలోనే ఏపీలోని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం కేటాయించి.. ఇల్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. వైసీపీ పాలనలో గాడి తప్పిన వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్న చంద్రబాబు.. అందుకే అన్నీ ఒక్కరోజులో చేయలేమని చెప్పారు.
Read Entire Article