తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సర్పంచ్, ఉపసర్పంచ్ల జాయింట్ చెక్ పవర్ విధానానికి స్వస్తి పలికేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీని స్థానంలో పాత పద్ధతి ప్రకారం సర్పంచ్, ప్రభుత్వ నియామక పంచాయతీ కార్యదర్శికి సంయుక్త చెక్ పవర్ అధికారాలను పునరుద్ధరించాలని భావిస్తోంది. సర్పంచ్, ఉపసర్పంచ్ల మధ్య రాజకీయ విభేదాలు, కుల వివక్ష కారణంగా నిధుల విడుదల నిలిచిపోతుండటంతో పంచాయతీ రాజ్ శాఖ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.