పోలవరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగం, బనకచర్ల అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్కు షాక్ తగిలింది. ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తక్షణ ఊరట ఇవ్వలేదు. మెయిన్ పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం.. వాటిని సరిదిద్దే వరకు విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం.. ఇంజెక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం కూడా ప్రస్తుతం సాధ్యం కాదని వెల్లడించింది.