వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. గోదావరి నదిలోకి మురుగు నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు నిరంతరం తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో కలిసి కాలుష్యరహిత గోదావరి, పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేశారు.