గొర్రెల కాపరి దానయ్య మృతి కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. లాయర్లతో కలిసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఆరవ్.. పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మరోవైపు జూలై పదో తేదీ శుక్రవారం రోజు దానయ్య అనే గొర్రెల కాపరి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అయితే ఆ బైక్ నడిపి ప్రమాదానికి కారణమైంది అప్పలరాజు తనయుడు ఆరవ్ అని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆరవ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.